నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు
అసమాన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సై జ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డికి సం బంధించిన 11ప్రాంతాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తుల ను అధికారులు గుర్తించారు.అయితే ప్రస్తుత మార్కెట్ విలువ దీనికంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తు న్నారు.
సోదాల్లో గుర్తించిన ఆస్తులు :
🔹 4 ఇళ్లు
🔹 1 వాణిజ్య భవనం (కమర్షియల్ బ్లా క్)
🔹 8 స్థలాలు (ప్లాట్లు)
🔹 10.23 ఎకరాల వ్యవసాయ భూమి
🔹 బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల నిల్వలు
🔹 3 బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది.
Comments
Post a Comment