Posts

Showing posts from June, 2026

పి.ఏం.స్వనిధి కొత్త సదుపాయాలతో ముందు కు...జి.శ్రీనివాసులు,కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్...

Image
పి.ఏం.స్వనిధి కొత్త సదుపాయాలతో ముందు కు జి.శ్రీనివాసులు,కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పో రేషన్,జూన్,30 : పి.ఎం.స్వనిధి మహోత్సవం పురస్కరించు కొని వీధి వ్యాపారుల ఆర్థిక శక్తి వంతం కొరకు పిఎం స్వనిధి పథకం క్రెడిట్ కార్డ్ లు,లోక్ క ల్యాణ్ మేళా డిజిటల్ లావా దేవీలను ప్రారం భిస్తున్నట్లు కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు తెలియజేశారు.మంగళవారం బా ల భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ వీధి వ్యాపారుల ఆర్థిక స్థి రత్వం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ.ఎం స్వనిధి పథకం కొత్త సదుపాయాలతో ముందుకు సాగుతోందన్నారు. పీ.ఎం.స్వనిది క్రెడిట్ కార్డ్ : రూపే క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులకు రూ. 10,000 నుండి రూ.30,000 వరకు వడ్డీ రహి త క్రెడిట్ అందుబాటులో ఉంటుందన్నారు.రు ణాలను సమయానికి చెల్లించిన లబ్దిదారులు అధిక పరిమితి పొందే అవకాశం ఉందని చె ప్పారు.ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి న ఈ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయం కూ డా లభిస్తుందనీ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ని ర్వహిస్తున్న 'లోక్ కల్యాణ్ మేళాలు' ద్వ...

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అంద రూ సహకరించాలి...పల్స్ పోలియో కార్యక్ర మంలో కమ్మరి పార్వతమ్మ...

Image
పోలియో రహిత సమాజ నిర్మాణానికి అంద రూ సహకరించాలి పల్స్ పోలియో కార్యక్రమంలో కమ్మరి పార్వత మ్మ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు,జూన్, 29 :  కల్లూరు మండలం,వీకర్ సెక్షన్ కాలనీలోని 10 8వ సచివాలయం,ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పా ఠశాల,బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో "జీవి తానికి రెండు చుక్కలు" కార్యక్రమంలో ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కా ర్పోరేషన్ చైర్‌పర్సన్,నంద్యాల పార్లమెంట్ మ హిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ హాజ రయ్యారు.ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నా రులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ రాష్ట్రంలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని,పోలియో రహిత స మాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించా లని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 37వ వార్డు ఇన్‌చార్జి సుతారు రాఘవేంద్రతో పాటు స్థానిక నాయకులు,అధికారులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

వైభవంగా పల్స్ పోలియో ప్రారంభం... జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్...

Image
వైభవంగా పల్స్ పోలియో ప్రారంభం జాయింట్ క లెక్టర్ నూరుల్ కమర్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు హాస్పి టల్ : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభో త్సవం ఆదివారం ఇందిరాగాంధీ మెమోరియ ల్ స్కూలులో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమ ర్ చేతుల మీదుగా జరిగింది.కార్యక్రమానికి వ చ్చిన ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు పో లియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొదటి రోజు ఆదివారం నాడు బూతులలో చుక్కలు వేస్తారని రెండవ,మూడ వరోజు సోమ,మంగళవారాల్లో ఇంటింటికి తిరి గి సిబ్బంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తా రని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవానికి వివరాలు ఆన్లైన్లో ఎక్కిస్తారన్నారు. సాయంత్రం 6-00 గంటల ప్రాంతం వరకు జిల్లా లో 79 శాతం 0-5 స...పిల్లలకు అందించారు. మిగిలిన 21శాతం పిల్లలకు సోమ,మంగళవా రాల్లో ఇంటింటి సందర్శనలో పూర్తి చేస్తారని ఇమునైజేషన్ అధికారి డాక్టర్ ఉమా తెలిపా రు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్,ఇమ్మునైజేషన్ అధికా రి డాక్టర్ ఉమా,స్టేట్ అబ్జర్వర్ వాసు బాబు, స్థానిక కార్పొరేటర్ పద్మలత,డెమోప్రకాష్ రా జు,హెచ్ ఈఈఓ బాబా ఫక్రుద్దీన్,స్థానిక యు పిఎస...

ఓర్వకల్లు రాక్ గార్డెన్‌లో విజయ్ దేవరకొండ 'రణబలి' సినిమా చిత్రీకరణ...

Image
ఓర్వకల్లు రాక్ గార్డెన్‌లో విజయ్ దేవరకొండ 'రణబలి' సినిమా చిత్రీకరణ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ఓర్వకల్ : కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని ప్రసి ద్ధ రాక్ గార్డెన్స్‌లో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'రణబలి' సినిమా చిత్రీక రణ కొన సాగుతోంది.రాయలసీమ చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం 1878 ప్రాంతంలో జరిగిన చారిత్రక సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చారిత్రాత్మక యాక్షన్ ఫాంటసీ అని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటి స్తున్నారని ఆయన వెల్లడించారు.ఓర్వకల్లు రా క్ గార్డెన్స్‌తో పాటు రాయలసీమలోని పలు చారిత్రక ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోందని చెప్పారు.షూటింగ్‌కు సహకరించిన స్థానిక ప్ర జలు,మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ,ప్రే క్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఒక గొప్ప సిని మాను త్వరలో అందిస్తామని దర్శకుడు పేర్కొ న్నారు.రాక్ గార్డెన్స్‌లో జరుగుతున్న చిత్రీకర ణను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబ రుస్తున్నారు.

రూ.25వేలు లంచం తీసుకున్న అధికారిని ఏసీ బీ పట్టివేత...

రూ.25వేలు లంచం తీసుకుంటున్న అధి కారిని ఏసీబీ పట్టివేత నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ముదిగొండ, జూన్,28 : ఖమ్మం జిల్లా,ముదిగొండ మండలం,భా నాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి త మ్మిశెట్టి సురేష్.. ఫిర్యాదుదారుడి నుంచి రూ.25వేలు లంచం డిమాండ్ చేసి తీసు కుంటుండగా ఖమ్మం ఏసీబీ రేంజ్ అధికా రులు పట్టుకున్నారు.ఫిర్యాదుదారుడి ఇంటి స్థలంలో నిర్మిస్తున్న ఒక గది రేకుల షెడ్ కు భవన అనుమతి ప్రక్రియ పూర్తి చేయడం,ఇంటి నంబర్ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి లంచం కో రినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ముదిగొండ మండలంలోని రైతు వేదిక సమీపంలో లంచం స్వీకరిస్తుండగా అధి కారులు దాడి చేసి పట్టుకున్నారు.నింది తుడి వద్ద నుంచి లంచం సొమ్ము రూ. 25వేలు స్వాధీనం చేసుకున్నారు.అనం తరం పంచాయతీ కార్యదర్శిని అరెస్ట్ చేసి వరంగల్లోని ఎస్పీఈ,ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

జూలై,5,6న మహా శాంతియుత నిరసన కా ర్యక్రమాన్ని విజయవంతం చేయండి...అల్తాఫ్ హుస్సేన్,ఏపీ నీట్ అభ్యర్థుల మెడికోస్ పేరెం ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు...

Image
జూలై,5,6న మహా శాంతియుత నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అల్తాఫ్ హుస్సేన్,ఏపీ నీట్ అభ్యర్థుల మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి,జూన్,29 : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు పెంచాలని జూలై 5,6న మహా శాంతియుత నిరసన కార్యక్రమా నికి విజయవంతం చేయాలని ఏపీ నీట్ అభ్య ర్థుల మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చా రు.ఆది వారం బిర్లా కాంపౌండ్ లోని ఏపీటీ ఎ ఫ్ కార్యాలయంలో ఏపీ నీట్ అభ్యర్థుల మెడి కోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స న్నాహక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్తాఫ్ హుస్సేన్ మాట్లా డుతూ రాష్ట్రంలో ఎంబీ బీఎస్ సీట్ల పెంపు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల నియంత్ర ణ కోసం జూలై,5వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గ ర భారీ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.కావున ఈ ధర్నాకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి నీ ట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు,వారి తల్లి,దం డ్రులు భారీ ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మెడికో అం డ్ అస్పరెంట్ అసోస...

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

Image
దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ వి.వి.నాయుడు,రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,29 : దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డి ఓ కె. సందీప్ కుమార్ అని రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు వి.వి.నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.క ర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ చేసిన ప్రకటన పూర్తిగా అసత్యమని,దీనిని తీవ్రంగా ఖండిస్తు న్నా మని అన్నారు.ఆర్ డిఓ హోదా ను ఉపయోగించుకుని అసత్య ప్రచారం చేస్తూ అధికారులను,ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని ఆరోపించారు.అతను కలంధర్,అంజి అనే ప్రైవేటు వ్యక్తులను దలారులుగా పెట్టు కొని దందా నడుపుతూ,ఇతరులపై ఇష్టమొ చ్చినట్లు నిందలు వేయడం అతనికి అలవాటే నని అన్నారు.గార్గేయపురం విషయంలో ప్రెస్ నోట్ ఇచ్చింది బాధితులేనని,తాను కేవలం ప్రెస్‌కు పంపించడంలో సహాయం మాత్రమే చేశానని పేర్కొన్నారు.అంతేకాకుండా తాను ఆ భూమికి అగ్రిమెంట్ హోల్డర్‌నని,ఆర్ డిఓ  మొన్నటి వరకు తనతో మంచిగానే చాటింగ్ చేసి భూమి విలువైనదని చెప్పారని అన్నారు. అనంతరం ఐదు లక్షల రూపాయలు అడిగార ని,ఇవ్వలేమని చెప్పడంతో అవతలి పార్టీత...

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు...చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

Image
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,29 : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు జిల్లాలో నేరనియంత్రణ,శాంతి భద్రతల పరి రక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు,నేరచ రిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలిం గ్ నిర్వహించారు.సత్ప్రవర్తనతో జీ వించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండా లని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపా లలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠి న చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీ సు అధికారులు హెచ్చరించారు.

ఎస్‌ఐఆర్ లో ఓటర్లందరూ భాగస్వాములు కావాలి...బీఎల్‌వోల పనితీరు పరిశీలన... సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి...జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్...

Image
ఎస్‌ఐఆర్ లో ఓటర్లందరూ భాగస్వాములు కావాలి బీఎల్‌వోల పనితీరు పరిశీలన సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పో రేషన్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం పూర్తి చే సేందుకు ప్రతి ఓటరు భాగస్వామి కావాలని జి ల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పిలుపు నిచ్చారు.ఆదివారం ఇందిరాగాంధీ మెమోరి యల్ స్కూల్ సమీపంలో 100,101,102 పో లింగ్ బూత్‌ ల పరిధిలో బిఎల్వోలు చేపడు తున్న ఎస్‌ ఐఆర్ ప్రక్రియను జేసి,కర్నూలు ని యోజకవర్గ ఈఆర్వో,నగరపాలక సంస్థ కమి షనర్ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించా రు.ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రి యను వేగవంతంగా,పారదర్శకంగా నిర్వహిం చాలని సూచించారు.ఓటరు సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని బీఎల్‌ ఓల ను ఆదేశించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను దశల వారీగా కాకుండా సాధ్యమైనంత వరకు ఒకే సందర్శనలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు.ఓటర్లు అవ సరమైన పత్రాలను వెంట తీసుకువస్తే ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుందని తెలిపా రు.ఈ కార్...

ములుగు జిల్లాలో విషాదం...పిడుగుపాటుకు 21ఆవులు మృతి...

ములుగు జిల్లాలో విషాదం పిడుగుపాటుకు 21ఆవులు మృతి నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ములుగు, జూన్,27 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం అం కంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి విషా దకర ఘటన చోటుచేసుకుంది.ఆవులను ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేయ గా,భారీ వర్షంతో పాటుగా ఒక్కసారిగా పి డుగు పడటంతో 21ఆవులు అక్కడికక్క డే మృతి చెందాయి.ఈ ఘటనతో పశు వుల యజమాని సమ్మయ్యతో పాటు గ్రా మస్తులు తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో పశు వులు మృతి చెందడంతో యజమానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి కింద పడిన ఐదుగురు విద్యార్థులు...

Image
కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి కింద పడిన ఐదుగురు విద్యార్థులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,బెంగళూరు, జూన్,27 : దేశంలో ఎక్కడైనా పాఠశాల వాహనాలకు సం బంధించిన ప్రమాదాలు జరిగిన ప్రతి సారీ వి ద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి.అలాంటి ఘటనలు పునరావృతం కా కుండా ఉండేందుకు తల్లి,దండ్రులు,పాఠశాల యాజమాన్యాలు,విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండ టంతో పాటు భద్రతా నిబంధనలను కచ్చితం గా పాటించాల్సిన అవసరం ఉంది.తాజాగా గత శుక్రవారం బెంగళూరులోని కేఆర్ పురం ప్రాంతంలో ఓ కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి ఐదుగురు విద్యార్థులు కిందపడిన ఘ టన కలకలం రేపింది.అదృ ష్టవశాత్తూ వారికి తీవ్రగాయాలు కాలేదు.అయితే ఈ ఘటన పె ద్ద విషాదానికి దారి తీసే ప్రమాదం ఉండేది.కే వలం తక్కువ ఖర్చు అవుతుందనే కారణంతో రిజిస్ట్రేషన్ లేని స్కూల్ వ్యాన్లు,షేర్డ్ ట్యాక్సీల్లో పిల్లలను పంపించడాన్ని తల్లిదండ్రులు నివా రించాలి.పిల్లల ప్రాణ భద్రతకు ఎలాంటి ప్ర త్యామ్నాయం లేదు.అలాగే పాఠశాల విద్యా ర్థులను రవాణా చేసే అన్ని వాహనాలపై ప్రభు త్వం క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, రిజిస్ట్రేషన్ లేని లేదా నిబంధనలకు...

చుట్టాలే కదా...గుడ్డిగా నమ్మి రూ.21లక్షలు ఇచ్చింది...డబ్బులు అడిగితే మహిళపై వేధిం పులు...

Image
చుట్టాలే కదా...గుడ్డిగా నమ్మి రూ.21లక్ష లు ఇచ్చింది డబ్బులు అడిగితే మహిళపై వేధింపులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,విశాఖ,జూన్, 27 : ఆపదలో ఉన్నారని,తెలిసిన వారే కదా... అని ఆదుకున్న ఓ మహిళకు ఊహించని షాక్ తగి లింది.ఆమెకు తెలియకుండానే ఆమె వీడియో లు రికార్డ్ చేసిన దుండగులు.తమకు న్యూడ్ కాల్స్ చేయకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తా మంటూ...రివర్స్‌ లో ఆమెనే బ్లాక్‌ మెయిల్ చేయడం ప్రారంభించారు.బంధు వు లని నమ్మి డబ్బులు ఇస్తే ఇంత మోసం చేస్తా రా అని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నింది తులను అదుపులోకి తీసుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి...విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సా గిస్తోంది.ఆ టైలరింగ్ ద్వారా వచ్చిన డ బ్బును పొదుపు చేస్తూ ఆర్థికంగా ఎదుగు తోం ది.అయితే ఈ విషయం ఆమె సమీప బంధు వులైన చొక్కర అశోక్,వండ్రాసి శంకర్ అనే ఇద్ద రు వ్యక్తులకు తెలిసింది.దీంతో తాము కష్టాల్లో ఉన్నామని...కొంత నగదు సాయం చేయాల ని...తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమెను నమ్మబలికారు....

ఐదు పెళ్లిళ్లు,అందరికి ఒకే మోసం... అనంతపురంలో నిత్య పెళ్లికూతురు అరెస్ట్...

Image
ఐదు పెళ్లిళ్లు,అందరికి ఒకే మోసం అనంతపురంలో నిత్య పెళ్లికూతురు అరెస్ట్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,విజయవాడ, జూన్,27 : ఐదు పెళ్లిళ్లు చేసుకుని,అందరిని ఒకే విధంగా మోసం చేసి,ఆరవ పెళ్ళికి సిద్దపడ్డ నిత్య పెళ్లి కూతురును పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకా రం...విజయవాడకు చెందిన సుమప్రియ,అశో క్,శశికళ,రామకృష్ణ అనే మధ్యవర్తులతో కలిసి ఈమె ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.పెళ్లి సమయంలో కట్నం లేదా ఇతర ప్రలోభాలతో కూడిన హామీలు ఇ చ్చి,వివాహానంతరం కొద్ది రోజులు భర్తతో కలి సి ఉండి,ఆపై కనిపించకుండా పోవడం ఈమె పంథా అని పోలీసులు తెలిపారు.పెద్దవడు గూరు మండలం కాసేంపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని 2025లో ఈమె వివా హం చేసుకుంది.పెళ్లైన కొద్ది రోజులకే ఆమె ఎ వరికీ చెప్పకుండా అదృశ్యం కావడంతో, బాధి తుడు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యా దు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇటీవల కర్ణా టకలోని మల్లికుప్పంకు చెందిన వ్యక్తిని వివా హం చేసుకున్న నిందితురాలు,పెళ్లైన ఆరు రో జులకే మద నపల్లె వైపు ప్రయాణిస్తుండగా పో ల...

లడ్డు కావాలా నాయనా...ఒక లడ్డు కి ఒక లడ్డు ఫ్రీ...చిట్టి నిర్వహుకుల బంపరాఫర్....

Image
లడ్డు కావాలా నాయనా ఒక లడ్డు కి ఒక లడ్డు ఫ్రీ చిట్టి నిర్వహుకుల బంపరాఫర్ ఆశ పడితే...మీ డబ్బులుకు గ్యారంటీ  సిఐ సత్యనారాయణ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,గుంటూరు,జూ న్,28 : గుంటూరు,నగరంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి లో ప్రజలు అనుమతులు లేని చిట్‌ ఫండ్ సం స్థలకు దూరంగా ఉండాలని సీఐ సత్యనారా యణ సూచించారు.అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ కొందరు మోసాలకు పాల్పడు తున్నారని ఆయన హెచ్చరించారు.ఏదైనా చి ట్‌ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే ది తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ప్రజ లకు సూచించారు.చట్టవిరుద్ధంగా చిట్టీలు ని ర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని,ప్రజలు అప్ర మత్తంగా ఉండి ఆర్థిక మోసాల బారిన పడ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

కాబోయే భర్తకు యువతి ప్రైవేట్ పిక్స్ పంపిన ఉన్మాది...మనస్తాపంతో పెళ్లికూతురు,తల్లిదం డ్రుల ఆత్మహత్య...

Image
కాబోయే భర్తకు యువతి ప్రైవేట్ పిక్స్ పంపిన ఉన్మాది మనస్తాపంతో పెళ్లికూతురు,తల్లిదండ్రుల ఆత్మ హత్య నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మైసూరు,జూ న్,28 : కర్ణాటకలోని మైసూరు జిల్లా కేంపైనహుండి గ్రామంలో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో తీ వ్ర విషాదం నెలకొంది.తన ప్రేమను తిరస్కరిం చిందనే కక్షతో ఓ యువకుడు పంపిన ప్రైవేట్ ఫోటోల కారణంగా మనస్తాపానికి గురై,పెళ్లికూ తురు ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆత్మహత్య కు పాల్పడింది.21ఏళ్ల రక్షితకు జూన్,24న వి వాహం జరగాల్సి ఉంది.అయితే గతంలో ఆ మెను ప్రేమించాలంటూ వేధించిన ఉల్లాస్ గౌడ అనే యువకుడిని రక్షిత,ఆమె తల్లి దండ్రులు అందరిముందూ తిరస్కరించారు.అప్పటినుం చి కక్ష పెంచుకున్న ఉల్లాస్ ఆ కుటుంబపై ఒత్తి డి తెస్తూనే ఉన్నాడు.జూన్,21రాత్రి రక్షిత తం డ్రి శివన్న (54), తల్లి నాగరత్న (44) ఉల్లా స్‌ను అతని తల్లిదండ్రులను తమ ఇంటికి పిలిపించి గట్టిగా హెచ్చరించారు.అంతేకాకుం డా ఉల్లాస్ మొబైల్‌లో ఉన్న రక్షిత ప్రైవేట్ ఫో టోలు,మెసేజ్‌లను డిలీట్ చేయించారు.అ యినప్పటికీ ఉల్లాస్ కొన్ని ఫోటోలను తన వద్దే ఉంచుకుని,ఇంటికి వెళ్లిన వెంటనే వాటిని రక్షి త కాబోయే భర్తకు పంపించాడు.దాంతో ఆగ్ర...

11వివాహాలు...18మంది మహిళలతో శారీరక సంబంధం...

Image
11వివాహాలు...18మంది మహిళలతో శారీరక సంబంధం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,బెంగళూరు, జూన్,28 : బెంగళూరు జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలుకా లో వివాహిత మహిళలను లక్ష్యంగా చేసుకు ని,వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం,దా నిని వీడియో తీయడం,వారిని బ్లాక్‌మెయిల్‌ చే యడం వంటి తీవ్ర మైన ఆరోపణలపై బెంగళూ రు రూరల్‌ జిల్లాలోని ఆనేకల్‌ తాలూకా సర్జా పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాకేష్‌ అనే వ్యక్తి పై కేసు నమోదైంది.పోలీసు వర్గాల సమాచా రం ప్రకారం నిందితుడు రాకేష్‌ ఒక మంచి వ్య క్తిగా పరిచయం చేసుకుని మహిళల నమ్మకా న్ని పొందేవాడని తెలిసింది.ఆ తర్వాత అత ను వారితో శారీరక సంబంధం పెట్టుకుని,దాని ని వీడియో తీసి,వారి ని బెదిరించినట్లు ఆరో పణలు ఉన్నాయి.అతనికి సుమారు 18మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని,అనేక వివాహా లు చేసుకున్నాడని కూడా కేసులో ఆ రోపణలు ఉన్నాయి.కాగా ఫిబ్రవరి,22న హె బ్బగోడికి చెందిన భవ్య అనే యువతిని వివా హం చేసుకున్న రాకేష్,పెళ్లయిన కొద్దిరోజులకే కోటి వరకట్నం కోసం ఆమెను వేధించాడని ఆ రోపిస్తూ ఒక ఫిర్యాదు దాఖలైంది.అతని గత సంబంధాలు,ఆరోపిత వీడియోల గురించి భా ర్యకు తెలియగానే,ఆమెపై పెట్రోల్‌ పోసి హ త్యా...

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అధికారులు...

Image
రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన అధికారులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : రాజస్థాన్లో ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు వేచి ఉండగా...మహిళా కానిస్టేబుల్ తన టే బుల్ పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూ ర్చున్న ఫొటో వైరల్ కావడంతో ఆమెను స స్పెండ్ చేశారు.దుంగార్పూర్ జిల్లాలోని బిచ్చి వార పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది.ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో,ఆమెపై క్రమశిక్షణా చర్యలు కూడా ప్రారంభించినట్లు పోలీసులు వె ల్లడించారు.

కాలుష్యం నివారణ అధికారి యుగంధర్ ము ని ప్రసాద్ అక్రమ ఆస్తులపై ఎసిబి దాడులు... భారీగా బంగారు,వెండి స్వాధీనం...

Image
కాలుష్యం నివారణ అధికారి యుగంధర్ ము ని ప్రసాద్ అక్రమ ఆస్తులపై ఎసిబి దాడులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,25 : కర్నూలు,చైతన్యపురి కాలనీలో నివాస ముం టున్న కాలుష్యం నివారణ అధికారి యుగంధ ర్ ముని ప్రసాద్ ఆస్తులపై శుక్రవారం ఎసిబి దా డులు చేపట్టారు.ఒకేసారి కర్నూలు,తిరుపతి, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో ఈ దాడు లు జరిగాయి.ఇందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు చైతన్య పురి కాలనీలోని యుగంధర్ ముని ప్రసాద్ ఇంట్లో జరిగిన దాడుల్లో ఒక లా కర్ తోపాటు,భారీగా బంగారం,వెండి,పలు డా క్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు నాలుగు కోట్లు అక్రమ ఆ స్తులను గుర్తించారు.అదేవిదంగా హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.ఇంకా పూర్తి సమాచారం తెలియా ల్సి ఉంది.అయితే పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వివరాలు తెలుపుతామని డిఎస్పీ సోమన్న పేర్కొన్నారు.

వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరంగం... ప్రయాణికులపై బూతుల ప్రదర్శన...

Image
వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరంగం ప్రయాణికులపై బూతుల ప్రదర్శన నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,వినుకొండ,జూ న్,25 : పల్నాడు జిల్లా,వినుకొండ డిపో బస్సు కండక్ట ర్ మద్యం సేవించి ప్రయాణికులపై బూతులతో దుర్భాషాలాడిన ఘటన వీడియో సోషల్ మీ డియాలో వైరల్ అవుతుంది.వివరాలు ఇలా ఉన్నాయి...వినుకొండ నుంచి,దోమల గూడెం వెళుతున్న బస్సు కండక్టర్ ఆడవారి పట్ల,ప్ర యాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ప్ర యాణికులు చెపుతున్నారు.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నత అధికారులు విచారణ జరిపిం చి,కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణి కులు కోరుతున్నారు.

అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న క ష్టమ్స్ అధికారులు...

Image
అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న క ష్టమ్స్ అధికారులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,శంషాబాద్,జూ న్,25 : హైదరాబాద్,శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బం గారాన్ని పట్టుకున్నారు.కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల న డుము భాగంలో ప్రత్యేక పౌచ్‌లలో పేస్ట్ రూ పంలో దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు.రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారె ట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకు న్నారు.నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్...

Image
ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితు డిని అని,హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ కు ప్రాణ స్నేహితుడిని అని చెప్పుకొని లక్షల రూపాయ లు సూర్యాభాయ్ వసూలు చేసినట్లు అందిన పిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు సూ ర్యాభాయ్ ని అరెస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఒళ్లంతా బంగారం ధరించి గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్‌గా చెప్పుకుంటూ,త క్కువ ధరకు స్వచ్చమైన బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసాలు.డబ్బులిచ్చి నెల లు గడుస్తున్నా బంగారం ఇవ్వలేదని ప్రశ్నిం చిన వారిపై సూర్యాభాయ్ ఎదురుతిరిగి బెది రించినట్లు తెలిసింది.దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఫిర్యాదు చేశారు. 

మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యా సం...నలుగురిపై ఎఫ్ ఐఆర్ నమోదు...

Image
మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం నలుగురిపై ఎఫ్ ఐఆర్ నమోదు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బడ్నగ ర్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా బాణాసం చాతో నింపిన వాహనాన్ని క్రేన్‌తో సుమారు 40 అడుగుల ఎత్తుకు ఎత్తి పేల్చిన ఘటనకు సం బంధించిన వీడి యో సోషల్ మీడియాలో వైర ల్ అయింది.ఈ ఘటనపై పోలీసులు నిర్వా హకుడు షోయబ్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు పాల్గొన్న వ్యక్తులు,క్రేన్ యజమానిపై కేసు న మోదు చేశారు.ప్రజల భద్రతకు ముప్పు కలి గించే ప్రమాదకర విన్యాసంగా పోలీసులు వి చారణ కొనసాగిస్తున్నారు.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వాహనంలో పేలుడు పదార్థాలు కా కుండా బాణాసంచా ఉపయోగించినట్లు అధి కారులు తెలిపారు.

బస్సులో రద్దీ ఎక్కువగా ఉందా..?ఒంటిమీద ఉన్న నగలు జాగ్రత్త...ముఠాగా ఏర్పడి బంగా రు గొలుసు దొంగతనానికి పాల్పడిన నిందితు డి అరెస్ట్...రెండున్నర తులాల బంగారు గొలు సు స్వాధీనం...

Image
బస్సులో రద్దీ ఎక్కువగా ఉందా..? ఒంటిమీద ఉన్న నగలు జాగ్రత్త ముఠాగా ఏర్పడి బంగారు గొలుసు దొంగత నానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్  రెండున్నర తులాల బంగారు గొలుసు స్వా ధీనం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,చాదర్‌ఘాట్, జూన్,25 : బస్సులో ప్రయాణికుడి మెడలో నుండి బం గారు గొలుసు దొంగిలించిన కేసులో చాదర్‌ ఘాట్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి,ఒక పాత నేరస్థుడిని అరెస్ట్ చేశారు.నిందితుడి నుండి రెండున్నర తులాల బరువు గల బంగా రు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి.ఈ నెల 23వ తేదీన ఫిర్యా దుదారుడైన గట్టు సీతారామారావు (61) లా లాజార్ ఎక్స్ రోడ్ బస్ స్టాప్ వద్ద టిఎస్ ఆర్ టిసి రూట్ నెంబర్ 72J బస్సు ఎక్కారు.బ స్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండ టాన్ని ఆసరాగా చేసుకుని,కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఫుట్‌బోర్డ్ సమీపంలో ఆయ న చుట్టూ గుంపుగా చేరి తోసేశారు.ఆ గందర గోళాన్ని అనుకూలంగా మార్చుకుని,నిందితు లలో ఒకరు సీతారామారావు మెడలో ఉన్న సుమారు 2.5తులాల బంగారు గొలుసును తెంపు కుని పారిపోయారు.బాధితుడు య శోద హాస్పిటల్ వద్దకు చేరుకున్నాక గొలుసు పోయినట్లు గమనించి,చాదర్‌ఘాట్ పో లీస్ స్టేషన్‌ల...

బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకు న్న మహిళలు...

Image
బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టు కున్న మహిళలు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : తెలంగాణ,ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహి ళలు గొడవపడిన ఘటన ఖమ్మం జిల్లాలో చో టుచేసుకుంది.మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర-ఖమ్మం వెళ్తున్న బస్సు వైరా (మం),పాలడుగు గ్రామ సమీపంలో రాగానే ఒక కుటుంబం ఎక్కింది.ఆ కుటుంబానికి చెం దిన ఓ మహిళ సీటు కోసం తోటి మహిళలతో వాగ్వాదానికి దిగింది.ఈ వాగ్వాదం తీవ్రమై,ఒ కరి నొకరు తోసుకుంటూ,జుట్టు పట్టుకుని కొ ట్టుకున్నారు.ఉచిత ప్రయాణంతో మహిళా ప్ర యాణికుల రద్దీ పెరగడంతో ఇలాంటి సంఘట నలు నిత్యకృత్యమయ్యాయి.

మాతృత్వానికే మచ్చ...ప్రియుడితో కలిసి పిల్ల లపై చిత్రహింసలు కాలిన గాయాలతో ఇద్దరు చిన్నారులు...తల్లి,ప్రియుడు అరెస్ట్...

Image
మాతృత్వానికే మచ్చ ప్రియుడితో కలిసి పిల్లలపై చిత్రహింసలు  కాలిన గాయాలతో ఇద్దరు చిన్నారులు తల్లి,ప్రియుడు అరెస్ట్ నేటిపత్రిక ప్రజా చరిత్ర,హైదరాబాద్,జూన్,24 : మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఓ తల్లి తన ప్రి యుడితో కలిసి కన్నబిడ్డలపై అమానుషంగా చిత్రహింసలకు పాల్పడిన ఘటన వెలుగు చూ సింది.అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారు లను రోజూ వేధిస్తూ,వారి శరీరాలపై వాతలు పెట్టి తీవ్ర గాయా లకు గురిచేయడం స్థానికం గా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం...బిహార్‌కు చెందిన పింకీ దేవి,సుజీత్ దంపతులు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి స్థానిక పరిశ్రమలో కార్మికు లుగా పనిచేస్తున్నారు.వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఈ క్రమంలో పింకీ దేవికి,చిందుకు మార్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివా హేతర సంబంధంగా మారింది.భార్య ప్రవర్తన పై తరచూ గొడవలు జరుగుతుండటంతో భర్త సుజీత్ మూడు నెలల క్రితం ఇంటిని విడిచి వెళ్లి పోయాడు.అనంతరం పింకీదేవి తన ప్రి యుడు చిందుకుమార్‌ను ఇంటికే తీసు కొచ్చి సహజీవనం ప్రారంభించింది.తమ సంబంధా నికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఆరే ళ్ల కుమార్తె ప్రియాంక,నాలుగేళ్ల కుమారుడు ...

సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి...త హసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్రజలు ధర్నా...

Image
సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్రజ లు ధర్నా నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు మం డలం : కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామ పం చాయ తీ,సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవా లని కోరుతూ సుందరయ్య నగ ర్ ప్రజలు మం డలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చే పట్టారు.ధర్నాకు మద్దతు తెలియజేస్తూ సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృ ష్ణ,మండల కార్యదర్శి హుసేనయ్య,గ్రామ ఎం పీటీసీ గోపాల్ మాట్లాడారు.గొందిపర్ల గ్రామపం చాయతీ,సుందరయ్య నగర్ లో సర్వేనెంబర్ 236లో అప్పటి కర్నూలు శాసన సభ్యులు ఎం.ఏ.గఫూర్ ఐదు ఎకరాల పొలాన్ని కొను గోలు చేసి 200మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి,ప ట్టాలు మంజూరు చేయించారని అన్నారు.ఆ రకంగా పట్టాలు మంజూరు చేసిన తర్వాత మి గిలిన కొంత భూమిని గ్రామ అవసరాల కోసం ప్రభు త్వ కార్యాలయాల నిర్మాణం కోసం కేటా యించారన్నారు.ఆ విధంగా ఏరియా ప్రజలు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారని,అయితే ప్రస్తు తం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభు త్వాలు ఆలోచన చేస్తుంటే,సత్తార్ అనే వ్యక్తి దాన్ని ఆక్...

దేశంలో ప్రధమ స్థాయిలో అశోక్ లేలాండ్ షోరూం సేవలు...మంత్రి టి.జి.భరత్ చేతుల మీదుగా అశోక్ లేలాండ్ షోరూం ఘన ప్రారం భం..

Image
దేశంలో ప్రధమ స్థాయిలో అశోక్ లేలాండ్ షోరూం సేవలు మంత్రి టి.జి.భరత్ చేతుల మీదుగా అ శోక్ లేలాండ్ షోరూం ఘన ప్రారంభం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జూన్, 25 : దేశవ్యాప్తంగా అశోక్ లేలాండ్ సంస్థ విని యో గదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తూ వాణిజ్య వాహన రంగంలో విశ్వసనీయ సం స్థగా నిలిచిందని మంత్రి టి.జి.భరత్ పేర్కొ న్నారు.గురువారం కర్నూలు శివారు ప్రాంతం లోని డోన్ రోడ్డు,గోశాల సమీపంలో,బెంగళూ రు జాతీయ రహదారి-44పై నూతనంగా ఏ ర్పాటు చేసిన అశోక్ లేలాండ్ షోరూంను ఆ యన ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ రవాణా రంగ అభి వృద్ధిలో అశోక్ లేలాండ్ సంస్థ కీలక పాత్ర పో షిస్తోందన్నారు.నాణ్యమైన వాహనాలతో పా టు అత్యాధునిక సర్వీస్ సదుపాయాలను అందించడం ద్వారా సంస్థ వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని తెలిపారు.కర్నూలు లో ప్రారంభమైన ఈ నూతన షోరూం ద్వారా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల వాహన య జమానులకు మెరుగైన సేవలు అందుబాటు లోకి వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశా రు.విక్రయాలు,సర్వీస్,విడిభాగాల సరఫరా వంటి సేవలను ఒకే చోట అందించే విధంగా షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు.అశోక్ లేలాండ్ ప్రతిన...

మన కర్నూలు...మన ఉక్కు...మన రాయల సీమ...ఘనంగా జయరాజ్ స్టీల్ ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఏజెన్సీ స్టీల్ దుకాణం ప్రారంభం... ఎం.విక్రమ్ సింహ రెడ్డి,మాజీ కార్పోరేటర్...

Image
మన కర్నూలు...మన ఉక్కు...మన రాయల సీమ  ఘనంగా జయరాజ్ స్టీల్ ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఏజెన్సీ స్టీల్ దుకాణం ప్రారంభం ఎం.విక్రమ్ సింహ రెడ్డి,మాజీ కార్పోరేటర్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి,జూన్,25 : కర్నూలు నగరం,వెంకటరమణ కాలనీలో జ యరాజు స్టీల్,మాజీ కార్పోరేటర్,యజమాని ఎం.విక్రమ్ సింహ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఏజె న్సీ స్టీల్ దుకాణం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి జయరాజ్ స్టీల్ అధినేత ఎస్.కె. గోయాంక,ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ సిద్దార్థ జైన్, అసిస్టెంట్ మేనేజర్ రాజశ్రీ జైన్,వైస్ ప్రెసిడెంట్ రమ్య కొడాలి,రాయలసీమ డిస్ట్రి బ్యూటర్ వై భవ్ తాడేశ్వర్ లు హాజరై వారి చేతుల మీదు గా ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ టిఎంటి స్టీల్ లో కొత్త యుగం ఆ రంభవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హాబ్ నందు ఆసియాలోనే అత్యాధునిక టి. ఎం.టి రీబార్ తయారీ విధానాన్ని జయరాజ్ స్టీల్ ఆవిష్కరించడం జరిగింది అని అన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ అభివృద్ధితో పా టు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా జయరాజ్ స్టీల్ కోసం కృషి చే స్తుందన్నా...

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం... అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక...హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్...

Image
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్రతినిధి,జూన్,25 : ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భా రీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.వెలగ పూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన న టసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య,ఐటీ శాఖల మం త్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్య క్రమంలో పాల్గొన్నారు.అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.బాలకృష్ణ కుమా ర్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... సి నిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు. అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావ య్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నా.బాలయ్య బాబు నాయకత్వంలో సి నీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తు న్నాం.సినిమాతో పాటు క్రియేటర్ ఎకాన మీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాల నేది సీఎం చంద్రబాబు ఆలోచన.ఇందుకు కావాల్సిన మౌ లిక సదు...

14న స్కెచ్ ఫెయిల్...18న సక్సెస్...పుణె వ్యాపార వేత్త కొడుకు మృతిపై వీడిన మిస్టరీ...

Image
14న స్కెచ్ ఫెయిల్...18న సక్సెస్  పుణె వ్యాపారవేత్త కొడుకు మృతిపై వీడిన మిస్టరీ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : పుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యా పారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (2 6) మృతి వెనుక అత్యంత భయంకరమైన కు ట్ర కోణం వెలుగులోకి వచ్చింది.జూన్,18న లో హగఢ్ కోట వద్ద కే తన్ లోయలో పడి మర ణించడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే... అంటే జూన్ 14న కూడా అతడిపై హత్యాయ త్నం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలిం ది.కాబోయే భర్తను ఎలాగైనా వదిలించుకోవా లనే పట్టుదలతో,కాబోయే భార్యే తన ప్రియు డితో కలిసి వరుసగా చేసిన రెండో ప్రయత్నం లో అతడిని అంతమొందించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.పుణె రూరల్ పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేతన్ అగర్వాల్‌కు,సియా గోయల్ (20)అనే యువ తికి ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగిం ది.నవంబర్‌లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగు తున్నాయి.అయితే,అప్పటికే చేతన్ చౌదరి (2 2) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.దీంతో కేతన్‌ను చంపేయా లని ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే జూన్,14న ఇదే లోహగ ఢ్ కోట ...

జబర్దస్త్ నటి ఫైమా వివాహం

Image
జబర్దస్త్ నటి ఫైమా వివాహం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : జబర్దస్త్ మరియు బిగ్ బాస్ ఫేమ్ ఫైమా వివా హం చేసుకున్నారు.ఫైమా గత కొంతకాలంగా ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నా రు.వీరిద్దరూ సుదీర్ఘకాలం పాటు రిలేషన్‌ షిప్‌ లో ఉన్న తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యా రు.కుటుంబ సభ్యులు,పెద్దల నుండి కొన్ని నాటకీయ పరిణామాలు,వ్యతిరేకత ఎదురవ డంతో,వీరిద్దరూ హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో సింపుల్‌గా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో తమ పెళ్లికి సం బంధించిన వీడియోను ఫైమా సోషల్ మీడి యా వేదికగా అభిమానులతో పంచుకున్నా రు.కొందరు తమను విడగొట్టడానికి ప్రయత్నిం చారని,కానీ తాము అ నుకున్నట్లే ఒకటయ్యా మని ఆ వీడియోలో ఎమోషనల్ అయ్యారు. ఈ కొత్త జంటకు పలువురు బిగ్ బాస్ సెలబ్రి టీలు,జబర్దస్త్ నటులు,అభిమానులు,శుభాకాం క్షలు తెలిపారు.

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము అక్రమాస్తు లపై ఏసీబీ కేసు...రూ.87.44లక్షలు అక్రమా స్తులు గుర్తింపు...

Image
ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము అక్రమా స్తులపై ఏసీబీ కేసు రూ. 87.44లక్షలు అక్రమాస్తులు గుర్తింపు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కరీంనగర్, జూన్,25 : కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు కేసు నమో దు చేశారు.ఇతను గతంలో వేములవాడ ఎస్ హెచ్ ఓగా కూడా పనిచేశారు.ఈ నేపథ్యంలో అధికారులు జగిత్యాల భవానీ నగర్‌లోని అద్దె ఇంట్లో సోదాలు నిర్వహించారు.సోదాలో రూ. 87. 44 లక్షల అక్రమాస్తులు గుర్తించారు. స్వాదినం చేసుకున్న అక్రమాస్తులు :  నగదు : రూ.20,67,850 లక్షలు. బ్యాంక్ బ్యాలెన్స్ : ఏఓ ఎస్ బిఐ ఖాతాలో రూ.29,88,317లక్షలు,తండ్రి యుబిఐ ఖాతా లో రూ. 16,77,978లక్షలు. వస్తువులు విలువ : రూ.11,97,000 లక్షలు. స్థలాలు : కరీంనగర్ టౌన్‌లో ఓపెన్ ప్లాట్ రూ. 6,05,000 లక్షలు.సిరిసిల్లలో కమర్షియల్ ల్యాండ్ రూ.2,18,484 లక్షలు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.తదుపరి విచారణ జరుగుతోంది.

సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి...త హసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్రజలు ధర్నా...

Image
సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ ప్ర జలు ధర్నా నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు మం డలం : కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామ పం చా యతీ,సుందరయ్య నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాల ని కోరుతూ సుందరయ్య నగర్ ప్రజలు మండ లం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేప ట్టారు.ధర్నాకు మద్దతు తెలియజేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ, మండల కార్యదర్శి హుసేనయ్య,గ్రామ ఎంపీ టీసీ గోపాల్ మాట్లాడారు.గొందిపర్ల గ్రామపం చాయతీ,సుందరయ్య నగర్ లో సర్వేనెంబర్ 236లో అప్పటి కర్నూలు శాసన సభ్యులు ఎం.ఏ.గఫూర్ ఐదు ఎకరాల పొలాన్ని కొనుగో లు చేసి 200మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి,పట్టా లు మంజూరు చేయించారని అన్నారు.ఆ రకం గా పట్టాలు మంజూరు చేసిన తర్వాత మిగిలి న కొంత భూమిని గ్రామ అవసరాల కోసం ప్ర భుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం కేటా యించారన్నారు.ఆ విధంగా ఏరియా ప్రజలు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారని,అయితే ప్రస్తు తం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభు త్వాలు ఆలోచన చేస్తుంటే,సత్తార్ అనే వ్యక్తి దాన్ని ఆక్ర...

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విద్యుత్ శాఖ ఏఈ నిర్లక్ష్యం...ఫోన్లో సినిమా చూస్తూ కా లయాపన...

Image
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఈ నిర్లక్ష్యం ఫోన్లో సినిమా చూస్తూ కాలయాపన నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతిని ధి,జూన్,24 : కర్నూలు జిల్లా,ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో గత సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ అ ధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరిస్తుండగా విద్యుత్ శా ఖ ఏఈ ఉలిగప్ప మొబైల్లో సినిమా చూస్తూ కూర్చోవడం చర్చనీయాంశమైంది.ప్రజల సమ స్యలపై దృష్టి సారించకుండా కాలయాపన చే స్తున్నారని,గ్రీవెన్స్ కార్యక్రమాలు కేవలం పేరుకే నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నా రు.ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవా లని ప్రజలు కోరుతున్నారు.

చిన్నారిపై దారుణం...అత్యాచారం చేసి హ త్య...పోలీసుల వలలో నిందితుడు...

Image
చిన్నారిపై దారుణం...అత్యాచారం చేసి హత్య  పోలీసుల వలలో నిందితుడు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,న్యూఢిల్లీ,జూ న్,24 : దేశ రాజధాని ఢిల్లీలో 11ఏళ్ల బాలికపై అత్యా చారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు ద ర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహి స్తున్న సమయంలో నిందితుడు తప్పించుకు నేందుకు ప్రయత్నించగా,పోలీసులు అప్రమత్త మై అతడిని అడ్డుకున్నారు.అధికారుల వివరా ల ప్రకారం...పోలీసులపై ప్రతిఘటించిన నింది తుడిని అదుపులోకి తీసుకునేందుకు కాలుపై కాల్పులు జరిపారు.అనంతరం అతడిని సమీ ప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకు న్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీ డియాలో వైరల్‌గా మారింది.వీడియోలో నింది తుడు “నేను చనిపోయా” అంటూ ఏడుస్తుం డగా,పోలీసులు అతడిని తీసుకెళ్తున్న దృశ్యా లు కనిపిస్తున్నాయి.చిన్నారిపై జరిగిన ఈ దా రుణ ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రే కెత్తించింది.

కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ప్రకటించా లి...బి.చంద్రుడు,జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు...

Image
కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ప్రకటించా లి బి.చంద్రుడు,జిల్లా న్యాయవాదుల సంఘం అ ధ్యక్షులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు లీగల్, జూన్,25 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు రాయలసీమలోని జొన్నగిరి ప్రాంతానికి అ భివృద్ధి నేపథ్యంలో బంగారు వ్యాపారరీత్యా ఏర్పాటు చేయడానికి వస్తున్న సందర్భంగా క ర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వ ర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల స మావేశంలో మాట్లాడుతూ బి.చంద్రుడు,కే.ఓం కార్ లు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కర్నూలు లో హైకోర్టు బ్రాంచ్ నేటి వరకు ప్రారంభం కాలే దని అన్నారు.ఇందుకు కావున తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పరిపాల పరిపక్వత కలిగి,అన్ని విష యాల పట్ల అవగాహన ఉండి,దేశ రాజకీయా లలో కీలక పాత్ర వహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక ప్రాంతంలో హైకోర్టు బెంచ్ అమలు చేయడంలో ఆలస్యం జరుగు టంవల్ల రాయలసీమలో న్యాయ వాదులకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ,హైకోర్టు బెంచ్ విషయంలో త్వరగా ఏర్పాటు చేయించి ఆశి స్తున్నట్లు చెప్పారు.కర్నూలు జిల్లా న్యాయవా దులుగా ముఖ్యమంత్రి రాయలసీమ పర్యట...

గందరగోళంగా ఎస్ ఐ ఆర్...కానరాని బిఎల్ ఓలు...పూర్తిచేసిన అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వా లో తెలియని దుస్థితి...ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు...సిపిఎం...

Image
గందరగోళంగా ఎస్ ఐ ఆర్...కానరాని బిఎల్ ఓలు  పూర్తిచేసిన అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వాలో తెలి యని దుస్థితి  ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు సిపిఎం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జూన్, 25 : ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వే గం దర గోళంగా తయారైందని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.సాయిబాబా,కే.సుధా కరప్ప,నగర కమిటీ సభ్యులు ఎస్.హుస్సేన్ భాష,ఎం.సి.ఆనంద్ లు బుధవారం ఒక ప్రకట నలో తెలిపారు.32వ వార్డు ముజఫర్ నగర్ లో ఎస్ ఐ ఆ ర్ సర్వే జరుగుతుందని,కానీ కొ న్ని ఇండ్లకు ఇంతవరకు బిఎల్ ఓలు రాలేద ని,అప్లికేషన్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నా రు.అంతేకాకుండా కొన్నిచోట్ల బిఎల్ ఓలు ఇం టికి వచ్చి అప్లికేషన్లు ఇచ్చారు తప్ప అవి ఎ లా పూరించాలో,ఎక్కడ ఇవ్వాలో అనే విష యం తెలియక ప్రజలు గందరగోళానికి గురవు తున్నారని చెప్పారు.కొంతమంది తెలిసి తెలి యక పూరించిన అప్లికేషన్లు తీసుకొని సచివా లయం దగ్గరికి ఇవ్వడానికి వెళితే అక్కడ ఉ న్న అధికారులు మీకు అప్లికేషన్లు ఎవరు ఇ చ్చారో,వారి దగ్గరికి వెళ్లి ఇవ్వాలని,ఇది మాది కాదని సమాధానం చెప్పడం వల్ల అప్లికేషన్ లు ఎవరికి ఇవ...

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి...డాక్టర్ పి.శేషయ్య,మూడో పట్టణ సీఐ...

Image
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి డాక్టర్ పి.శేషయ్య,మూడో పట్టణ సీఐ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మూ డో పట్టణ సీఐ డాక్టర్ పి.శేషయ్య హాజరై వి ద్యార్థులకు మాదకద్ర వ్యాల వల్ల కలిగే ప్రమా దాలు,చట్టపరమైన పరిణామాలు,నార్కో టెర్ర రిజం ముప్పుపై అవగాహన కల్పించారు.డ్రగ్స్‌ కు దూరంగా ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎన్ డిపిఎస్ యాక్ట్ --1985, ఈగల్ విభాగం చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లు,డ్రగ్స్ సమాచారానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 వినియోగంపై వివరిం చారు.అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ డాక్టర్ అక్తార్ భాను,ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎ లిషా,కానిస్టేబుల్ మాసూమ్ వలి,స్ఫూర్తి వెల్ఫే ర్ సొసైటీ కోఆర్డినేటర్ శివ శంకర్,అధ్యాపకు లు,విద్యార్థులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత...500 మంది పోలీసులతో భారీ బందోబస్తు...పోలీ సులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి...నం ద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్...

Image
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత 500 మంది పోలీసులతో భారీ బందోబ స్తు పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండా లి నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,నంద్యాల క్రైం, జూన్,25 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఈ నెల 25వ తేదీన మంత్రాలయం మండ లం,మాధవరం గ్రామానికి విచ్చేయనున్న నేప థ్యంలో పర్యటనకు సంబంధించి బందోబస్తు విధుల నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి మంత్రాలయంలోని రివేరా ఫంక్షన్ హాల్లో నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ బుధవా రం భద్రతా విధులపై దిశానిర్దేశం చేశారు.ము ఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా ప్రాంగ ణం,హెలిప్యాడ్,వాహన పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్ర తా ఏర్పాట్లను సమీక్షించారు.ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా సుమా రు 500మంది పోలీసు అధికారులు,సిబ్బందిని విధుల్లో నియమించినట్లు తెలిపారు.అన్ని శా ఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప ర్యటనను విజయవంతం చేయాలని,విధుల్లో ఉన్న పోలీసు అధికారులు,సిబ్బం ది అప్రమ త్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులే కుండా విధులు నిర్వ ర్తించాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమం...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేయాలి...టవర్ క్లాక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆకులు కట్టుకొని నిరసన...

Image
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేయాలి టవర్ క్లాక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆకులు కట్టుకొని నిరసన నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు ఇవ్వాలని ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో అ నంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆకు లు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరస న తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతురు పరమేష్,అధ్యక్షులు తరి మెల గిరి,రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడు తూ బంగి శివ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభు త్వం పేద విద్యార్థుల పట్ల,ప్రభుత్వ విద్య పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అన్నారు.ప్రభు త్వ పాఠశాలలో తెరిచి రెండు వారాలు కా వస్తున్నా కూడా ఇప్పటివరకు విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిస్థాయిలో అందివలేదని అన్నారు. యుద్ధం కారణంతో విద్యార్థి మిత్ర కిట్లు ఇవ్వ డం లేదని ప్రకటనలో చేస్తున్నారన్నారు.అయి తే వాస్తవంగా దాదాపు రూ.870 కోట్ల రూపా యలు 2025,డిసెంబర్ నెలలోనే 2026-27 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థి మిత్రులకు కేటాయిస్తున్నామని చెప్పేసి,ముఖ్యమంత్రి, వి ద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ప్రభుత్వ ఉత్...

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ...

Image
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,న్యూ ఢిల్లీ, జూన్,24 : ప్రధానమంత్రి మోడీ న్యూఢిల్లీలో మంగళవా రం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో స మావేశమయ్యారు.రాష్ట్రపతి భవన్‌లో జరిగి న ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్ర పతి కార్యాలయం ఎక్స్ లో పంచుకుంది.అ యితే ఈ సమావేశం యొక్క అధికారిక అజెం డాపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానా లు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై...

Image
రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,24 : హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టే షన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వి.నర్సింహులు అవినీతి నిరోధక శా ఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు.వివ రాలు ఇలా ఉన్నాయి...అధికారిక విధులు ని ర్వహించేందుకు లంచం డిమాండ్ చేసి,అందు లో భాగంగా రూ.50వేలు నగదును స్వీకరి స్తుండగా ఏ సీబీ అధికారులు భహిరంగంగా పట్టుకుని అరెస్టు చేశారు.ఏసీబీ విడుదల చేసి న అధికారిక ప్రకటన ప్రకారం...గాంధీనగర్ పో లీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో స్టేషన్ బె యిల్ మంజూరు చేయడం,అలాగే భవిష్యత్తు లో ఫిర్యాదుదారుడిని వేధించకుండా ఉండడం కోసం ఎస్‌ఐ నర్సింహులు మొత్తం లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.దీం తో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యిం చగా,వారు పక్కా ప్రణాళికతో వలపన్ని చర్య లు చేపట్టారు.

రామ మందిర విరాళాలపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి...సుప్రీంకోర్టులో పిటిషన్‌...

Image
రామ మందిర విరాళాలపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి సుప్రీంకోర్టులో పిటిషన్‌ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,24 : ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్ర మా లు,నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చే యాలని,సీబీఐ విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది.రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవహారాలు,పరిపాలన కు సంబంధించి ఆర్థిక అవకతవకలు,ఇతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై సీబీఐ వి చారణ జరపాలని పిటిషన్‌ కోరింది.మరోవైపు విరాళాలకు సంబంధించి జరిగిన అవకతవక లపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ దా ఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పి ల్‌)ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చే సినందున,అత్యవసర విచారణ అవసరం లేద ని అభిప్రాయపడింది.