కువైట్లో చిక్కుకున్న బాధిత మహిళను రక్షించిన తిరుపతి జిల్లా పోలీస్ శాఖ...
కువైట్లో చిక్కుకున్న బాధిత మహిళను రక్షించిన తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
తిరుపతి జిల్లా,చంద్రగిరి మండలం,తొం డవాడ పంచాయతీ పరిధి,గోపాల పురం గ్రామానికి చెందిన భాగ్యవతి అనే మహిళ ఉపాధి నిమి త్తం కువైట్కు వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఏజెంట్ చెప్పిన ఉద్యోగం కా కుండా ఇతర పనులు చేయించడంతో ఆమె తీవ్ర మానసిక వేద నకు గురయ్యారు.ఈ నే పథ్యంలో ఆ మహిళ సోషల్ మీడియా వేది కగా తన ఆవేదనను పంచుకున్నారు.సమా చారం తెలు సుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్,జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు లు తక్షణమే స్పందించారు.సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిషన్ వెంకట్రావు ఆధ్వర్యం లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా కువైట్ కి పంపిన ఏజెంట్ ని వెంటనే గుర్తించి, ఎప్పటికీ అప్పుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని బాధిత మహిళను సు రక్షితంగా స్వదేశానికి రప్పించారు.వారికీ తగు సూ చనలు చేశారు.అనంతరం బాధిత మహి ళ రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృత జ్ఞతలు తెలిపారు.
జిల్లా ఎస్పీ సూచనలు :
1. ఏజెంట్ ల మాటలు నమ్మి మోసపోవద్దు.
2. ఏజెంట్ ల ద్వారా ఉపాధి కోసం విదేశాల కు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి.
3. ముందుగానే పూర్తి వివరాలు సేకరించాలి.
4. ఏదైనా అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టే షన్ లను సంప్రదించాలి.
5. విదేశాల్లో తమకు న్యాయం జరుగు తుంది అని తెలుసుకున్న తరువాతే తమ అంగీకారం తెలపాలి.తమ ప్రయాణం ప్రారంభించాలి.
Comments
Post a Comment