అక్రమ మట్టి,ఇసుక రవాణా...మూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన కలెక్టర్....
అక్రమ మట్టి,ఇసుక రవాణా
మూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన కలెక్టర్
కాగజ్నగర్ మండలంలోని గన్నారం,మాండ వ,ఆరెగూడ,అనుకోడ గ్రామాల్లో చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హరిత,అక్రమ మ ట్టి రవాణాపై కఠినంగా స్పందించారు.నజ్రుల్ నగర్ విలేజ్ నెం.12 పరిధిలో అనుమతులు లేకుండా మట్టి త రలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని,పోలీస్ స్టేషన్కు తరలిం చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా మట్టి లేదా ఇ సుక తరలిస్తే చట్టపరమైన కఠినచర్యలు తీసు కుంటామని,రవాణా చేపట్టే ముందు సంబంధి త శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ హెచ్చరించారు.
Comments
Post a Comment