మున్సిపల్ షాపులకు వేలంపాట నిర్వహించం డి...షాపుల ఎదుట ఆక్రమణలు తొలగించా లి...మొండి బకాయిలు చెల్లించకపోతే సీజ్ చే యండి...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓ బులేసు...
మున్సిపల్ షాపులకు వేలంపాట నిర్వహిం చండి
షాపుల ఎదుట ఆక్రమణలు తొలగించాలి
మొండి బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేయండి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ లలో ఖాళీగా ఉన్న దుకాణాలకు వెంటనే వే లం పాటలు నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారుల ను ఆదేశించారు.మంగళవారం ఆయన రెవె న్యూ విభాగ అధికారులతో కలిసి పెద్ద మార్కె ట్,కొండారెడ్డి బురుజు,కంట్రోల్ రూం,మద్దూర్ నగర్,వినాయక ఘాట్,గాంధీనగర్,సి.క్యాంపు ప్రాంతాల్లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ల ను పరిశీలించారు.25సంవత్సరాల లీజుకా లం పూర్తయిన మున్సిపల్ షాపులకు వెంటనే వేలం పాటలు నిర్వహించాలని కమిషనర్ ఆ దేశించారు.లీజుదారులు రహదారులను ఆక్ర మించి చేపట్టిన నిర్మాణాలు,ఇతర ఆక్రమణల ను పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సమ న్వయంతో తొలగించాలని సూచించారు.దీర్ఘ కాలంగా అద్దె బకాయిలు చెల్లించని లీజు దా రుల షాపులను సీజ్ చేయాలని ఆదేశించా రు.25 సంవత్సరాల లీజు కాలం ముగిసిన అ నంతరం వేలంపాటల నిర్వహణలో జాప్యం జ రిగిన నేపథ్యంలో అదనంగా షాపులను విని యోగించిన కాలానికి సంబంధించిన అద్దెను కూడా వసూలు చేయాలని స్పష్టం చేశారు.వే లంపాట ద్వారా షాపులు కేటాయించుకున్న ప్పటికీ వాటిని స్వాధీనం చేసుకోకుండా,అద్దె లు చెల్లించకుండా ఉన్న లీజుదారులకు నోటీ సులు జారీ చేసి,తిరిగి వేలంపాట నిర్వహిం చాలని ఆదేశించారు.మున్సిపల్ ఆస్తుల పరి రక్షణతో పాటు ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి సా రించాలని రెవెన్యూ అధికారులకు సూచిం చారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్కు మార్ రెడ్డి,ఆర్ ఓలు జునైద్,స్వర్ణలత,వాజిద్, ఆర్ఐలు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment